హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ చెరువు వద్ద చెత్త పేరుకు పోయి వానలు వల్ల దుర్వాసన వస్తున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి అధికారులను తీసుకుని దగ్గర ఉండి శుభ్రం చెయించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులను ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, శ్రీనివాస కాలనీ లో రూ. 28.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులు మొదలైన సందర్భంగా పనులను పరిశీలించడం జరిగింది అని, ఇంజనీరింగ్ మరియు ఇరిగేషన్ అధికారులతో సమన్వయ పరిచి పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అలానే పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఇరిగేషన్ ఏఈ విశ్వం, కాంట్రాక్టర్ బాబురావు, గిరి హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు నవీన్ నాయుడు, గూడూరు రమేష్, వెంకట్ చౌదరి, శ్రీనివాస్, సుబ్బరాజు, బి అర్ కె రాజు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో రూ. 28.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులకు గౌరవ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి శంకుస్థాపన చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీనివాస కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి కాలనీ లో పర్యటించి, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గారితో కలసి ప్రతేక పూజలు చేశారని చెప్పారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్లో మంచి నీరు, డ్రైనేజ్ పైప్ లైన్ తో కలుస్తున్న కారణంగా పైప్ లైన్ రిపేరు జరుగుతున్న పనులను, జలమండలి అధికారుల తో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ, మంచి నీరు, డ్రైనేజ్ పైప్ లైన్ తో కలసి అపరిశుభ్రంగా ఉన్నాయి అని తెలుసుకొని, జలమండలి అధికారులతో పనులు మొదలుపెట్టించి, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తేవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, లైన్ మెన్ సునీల్ వారి సిబ్బంది, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
జెఎన్టియూ వద్ద ఉన్న మంజీరా మాల్ లో కిరణ్ మోటార్స్ షో రూమ్ వారి నూతన వాహనం BREZZA కార్ ను ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి ఆవిష్కరించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో రూ. 88.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి సి రోడ్డు పనులకు, గౌరవ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి శంకుస్థాపన చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో షుమారు రూ.30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. అదే విదంగా సి సి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాంట్రాక్టర్ బాబురావు, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు గోపి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేష్, వెంకట్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.