Skip to content
గడ్డి అన్నారం డివిజన్లోని ప్రగతి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి సూచన మేరకు కాలనీలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ప్రేమ్ గారు పనులను ప్రారంభించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రగతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిలా ప్రతి కాలనీ వారు ఆలోచించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య చాలా వరకు తీరుతుందని అభిప్రాయపడ్డారు.
0 Comments