-
Previous
గడ్డిఅన్నారం డివిజన్ శ్రీనగర్ కాలనీ లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ నిర్వాహకులు రోడ్డును ఆక్రమించి వారి కాంప్లెక్స్ యొక్క పార్కింగ్ ర్యాంప్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు స్తంభం వేయడం వల్ల కాలనీకి మంచినీటి సరఫరా అయ్యే పైప్లైన్ దెబ్బతినడంతో కాలనీవాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, కాలనీ సంక్షేమ సంఘం వారు విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ గారు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య మరియు విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి వారికి సమస్యను వివరించి వెంటనే చర్య తీసుకొని రాంపులు తొలగించి, మంచి నీటి పైప్ లైన్ పునరుద్ధరించి కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రేమ్ గారు మాట్లాడుతూ డివిజన్ లో ఎవరైనా భవనాలను నిర్మించేటప్పుడు రోడ్లను ఆక్రమించినా, వ్యక్తిగత అవసరాల కోసం రోడ్లను తవ్వి నా, వ్యాపారస్తులు చెత్తను స్వచ్ఛ్ఆటో వారికి ఇవ్వకుండా రోడ్లపై పడవేసినా కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. -
Next
రవీంద్ర భారతి లో జరిగినటువంటి అంతా రామమయం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు. సాంస్కృతిక మరియు దేవాదాయ శాఖ సౌజన్యంతో శ్రీ కోదండపాణి సంగీత విద్యా సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్త రామదాసు గారి గురించి ఈతరం వారికి తెలిసే విధంగా కోదండపాణి సంగీత విద్యా సంస్థ వారు ఇలాంటి మహత్కార్యాన్ని చేపట్టి అందులో తనను భాగస్వామిని చేయడం చాలా సంతోషకరం అని ఈ సందర్భంగా ప్రేమ్ గారు తెలియజేశారు.
0 Comments