అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో భూగర్భ డ్రైనేజీ రోడ్లపై పొంగిపొర్లి స్థానికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించిన కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో భూగర్భ డ్రైనేజీ రోడ్లపై పొంగిపొర్లి స్థానికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది అని స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు ఎయిర్ టేక్ మిషన్ సహాయంతో సివరేజ్ సిబ్బందితో మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ ఎయిర్ టేక్ మిషన్ సహాయంతో ప్రెషర్ పెట్టి లోపల ఉన్న షిల్టును తొలగించాలని చుట్టు పక్కల ఉన్న మిగతా మ్యాన్ హోల్స్ కూడా క్లీన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జావిదుద్దీన్, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, జుభేర్, యోగి రాజు, హరీష్, తదితరులు పాల్గొన్నారు.