జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ కూడలి లో మంగళవారం శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ శ్రీ CN రెడ్డి ఆజది కా అమృత మహోత్సవాలలో భాగంగా జాతీయ జెండాల పంపిణి కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్బంగా MLA శ్రీ మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రత్సవాలలో ప్రతి ఒక్కరూ జాతీయ స్ఫూర్తి ని చూపించాలని కోరారు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ లో గౌరవ శాసన సభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల మేరకు డివిజన్ ను దేదీప్యమానంగా తీర్చి దిద్దేందుకు నూతనం గా ఏర్పాటు చేయాల్సిన వీధి దీపాల పై ఈరోజు కార్పొరేటర్ శ్రీ CN రెడ్డి గారు GHMC విద్యుత్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని చోట్ల స్థంబాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం, విద్యుత్ దీపాలు కాలిపోవడం జరిగింది.. ఈ నేపథ్యంలో డివిజన్ లో కొత్తగా వేయాల్సిన విద్యుత్ స్థంబాలు, విద్యుత్ దీపాల పునరుద్దరణ పై అధికారులతో చర్చించడం జరిగింది.. ఈ సమావేశం లో GHMC ఎలక్ట్రికల్ EE ఇంద్రదీప్, డిప్యూటీ EE మల్లిఖార్జున్, AE రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు..
గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే టీ ఆర్ గారి జన్మదిన సందర్బంగా గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ డివిజన్ స్థాయిలో పూర్తయి నియోజకవర్గ స్థాయి పోటీలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా క్రికెటర్ వేంకటపతి రాజు, సినిమా హీరోలు డి జే టిల్లు, మరియు అడివి శేషు, పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే టీ ఆర్ గారి జన్మదిన అంటే యువతకు ఒక పండుగ లాంటిదని అన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలు ఈ రోజు నుండి 23 తారీఖు వరకు కొనసాగుతాయని అన్నారు. పోటీలు మొత్తం ఎక్కడ కూడా తగ్గకుండా హెచ్ ఐ సి వారితో జరిపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు సి ఎన్ రెడ్డి, రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, మన్నే కవిత రెడ్డి, సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, సంజీవ సంజీవ, మన్సూర్, ప్రదీప్, సంతోష్ ముదిరాజ్, కృష్ణమోహన్, జీ టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, విజయకుమార్, విజయ్ సింహ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు రహమత్ నగర్ డివిజన్ లో 1 కోటి 95 లక్షల రూపాయలతో ప్లే గ్రౌండ్ కు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ 5 ఎకరాలలో ప్లే గ్రౌండ్ నిర్మించడం జరిగిందని ఇక్కడ అని ఏర్పాట్లు చేసి మునుముందు ఇంకా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మన్సూర్ మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తన్ను ఖాన్, నాగరాజు, షరీఫ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.