Lingani Parasanna Addagutta Division Corporator.
అడ్డగుట్ట డివిజన్ శాంతి నగర్ లోని సత్య హరిచంద్ర శ్మశాన వాటికను జిహెచ్ఎంసీ అధికారులు, పార్టీశ్రేణులతో కలిసి శనివారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల విషయమై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గ్రేవ్ యార్డుల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో సత్య హరిచంద్ర శ్మశాన వాటికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.