Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: seri lingam palli

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.జాతీయ జెండాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.జాతీయ జెండాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు

శేరిలింగంపల్లి డివిజన్ లోగల GHMC జోనల్ కార్యలయంలో గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన జాతీయ జెండాను జోనల్ కమిషనర్ స్నేహ శబరీస్ గారితో మరియు తదితర డివిజన్ గౌరవ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులతో కలిసి ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ గారి వార్డ్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు హబీబ్ భాయ్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ వార్డ్ మెంబర్ శ్రీకళ, రాంబాబు, గోపాల్ యాదవ్, రవి యాదవ్, కొయ్యాడలక్ష్మణ్ యాదవ్, సుభాష్, సీనియర్ నాయకులతో కలిసి సుదర్శన్ నగర్ కాలనీ, గోపి నగర్, ఆదర్శ్ నగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హుడా ట్రేడ్ సెంటర్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, లింగంపల్లి విలేజ్ రావ్వ్స్ జిమ్, జయశంకర్ చౌరస్తా, ఎంపీపీఎస్ సురభి కాలనీ, ఆర్ జి కే సెంటర్, ఆరంభ టౌన్షిప్, బాపునగర్ హనుమాన్ యూత్, మసీద్ బండ సర్కిల్, ఇందిరా నగర్, గచ్చిబౌలి స్ట్రీట్ నెంబర్ 3, చిన్న అంజయ్య నగర్ మరియు పలు కాలనీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల శ్రీరామ్ నగర్ కాలనీ, తారానగర్ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో మరియు హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో “బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట” మహోత్సవం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు విచ్చేసి రామనామ స్మరణకు పాత్రులయ్యారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా రామాలయంలో నిర్వహించిన శ్రీ రామ యజ్ఞంలో పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న ‘కమాన్’ (ARCH) ను స్థానిక నాయకులతో, అసోసియేషన్ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.