సర్దార్ నగర్ పర్యటించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ .
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్దార్ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు పర్యటించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ సున్నం చెరువు మరియు కాముని చెరువు నుండి దిగువగా సబ్ధర్ నగర్ మీదుగా ప్రవహిస్తున్న నాలాలో తెలుడు వ్యర్ధ పదార్దాలు పేరుకుపోయి, నాలా ప్రవాహానికి ఆటంకం ఏర్పడటం వల్ల జిహెచ్ఎంసి సిబ్బంది మరియు జెసిబి సహాయంతో తేలుడు వ్యర్ధ పదార్ధాలను తొలగించి నాలా ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, జిహెచ్ఎంసి సిబ్బందికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, అహ్మద్, బాబా, పార్వతమ్మ, సన్నజాజుల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments