నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్..!
నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్..!
సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని అజీజ్ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ అజీజ్ నగర్, మెరాజ్ నగర్, పద్మావతి నగర్, సైడ్ త్రీ మీదుగా ప్రవహించే వర్షపు నీరు వల్ల చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందికరంగా ఉండేది కనుక గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహకారంతో 55 లక్షల వ్యయంతో స్ర్టాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులను పూర్తి చేసుకోగలుగుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ మోయిజ్, మహమ్మద్ చున్ను, జావీద్, మథిన్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments