Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో షుమారు రూ.30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. అదే విదంగా సి సి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాంట్రాక్టర్ బాబురావు, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు గోపి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేష్, వెంకట్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

5.7.2022 at 3.42

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *