Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Bannapagari Padma Bagh Maberpet division Corporator.

ఈనెల 24వ తేదీన అంబర్ పేట నియోజకవర్గంలో జరగనున్న బోనాల పండుగ ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, కార్పొరేటర్లు శ్రీమతి పద్మా వెంకట్ రెడ్డి గారితో, శ్రీ విజయ్ కుమార్ గౌడ్ గారితో, జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జి శ్రీ బి.వెంకట్ రెడ్డి గారితో, ఆలయ కమిటీ సభ్యులతో మరియు వివిధ డిపార్ట్ మెంట్ల అధికారులతో కలిసి మహంకాళీ అమ్మ వారి ఆలయం వద్ద బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తీ చేయాలని, అమ్మ వారి ఊరేగింపు రథం వచ్చే మార్గంలో కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, ఆలయం వద్ద మరియు బోనాలు తీసుకువచ్చే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అలాగే విద్యుత్ కు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.

అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి రోడ్డు మరమ్మత్తులు, డ్రైనేజీ సంబంధిత మరియు పారిశుధ్య పనులను వెంటనే పూర్తీ చేయాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *