C.Narayana Reddy Rahamath Nagar Coporator.
గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే టీ ఆర్ గారి జన్మదిన సందర్బంగా గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ డివిజన్ స్థాయిలో పూర్తయి నియోజకవర్గ స్థాయి పోటీలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా క్రికెటర్ వేంకటపతి రాజు, సినిమా హీరోలు డి జే టిల్లు, మరియు అడివి శేషు, పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కే టీ ఆర్ గారి జన్మదిన అంటే యువతకు ఒక పండుగ లాంటిదని అన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలు ఈ రోజు నుండి 23 తారీఖు వరకు కొనసాగుతాయని అన్నారు. పోటీలు మొత్తం ఎక్కడ కూడా తగ్గకుండా హెచ్ ఐ సి వారితో జరిపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు సి ఎన్ రెడ్డి, రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, మన్నే కవిత రెడ్డి, సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, సంజీవ సంజీవ, మన్సూర్, ప్రదీప్, సంతోష్ ముదిరాజ్, కృష్ణమోహన్, జీ టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, విజయకుమార్, విజయ్ సింహ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments