Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Boduppal

Commissioner Venugopal Reddy, Corporator Suman visited Boduppal,21 Division.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ *కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్* పలు సమస్యలను గౌరవ కమీషనర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా డివిజన్‌లో పర్యటించి అక్కడి సమస్యలను సంబంధిత అధికారులతో పరిశీలించి హామీ ఇచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని, డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరెడ్డి, ఎలుగొండయ్య, ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు, యువజన నాయకులు సూర్యనారాయణ, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, వార్డు అధికారి అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి

అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ పాల్గొన్నారు* ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏఐబీఎస్‌ఎస్ 71వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గారు. Rtd DG శ్రీ డిటి నాయక్ గారు,. మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములు నాయక్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ సింగ్ గారు, *రాష్ట్ర కార్యదర్శి శ్రీ భూక్య సుమన్ గారు*, కేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.