Dodla Venkatesh Goud Allwyn Colony Corporator.
124 డివిజన్ ఎల్లమ్మబండ రైతుబజార్ వద్ద జరుగుతున్న ప్రధాన రహదారి అయిన ఉషముళ్లవుడి రోడ్డు విస్తరణ పనులను స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు తెరాస పార్టీ ముఖ్యనాయకులు శ్రీ మాధవరం రంగారావు గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న రోడ్డు వైండింగ్ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని విస్తరించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తొలగి వాహనదారుల ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు రాజేష్ చంద్ర, AE సుభాష్, పోశెట్టిగౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments