Dodla Venkatesh Goud Allwyn Colony Division Corporator.
124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మొహరం సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తాలో ఉన్న మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన షర్బత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి షర్బత్ ను కాలనీ వాసులందరికి పంచడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ నగర్ కమాన్ ఎదురుగా ఉన్న దర్గాలో పీర్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ అమరుల ఇస్లాం మత పునర్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం పండుగ అని, డివిజన్ లోని ప్రజలందరూ కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగలు అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, సీనియర్ మైనారిటీ నాయకులు షౌకత్ అలీ మున్నా, కౌసర్, ఖాజీమ్, ఖాజామియా, ఖలీమ్, ఫిరోజ్, బాబా, ఖాజా, ఆఫ్రోజ్, పాషా, సజ్జు, దేవి, ఎనుగంటి శ్రీనివాస్, రాములుగౌడ్, సంతోష్, రవీందర్, మహేష్, ఎత్తరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments