Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Gunnala Sunitha Moula – Ali Corporator.

మౌలాలి డివిజన్లోని లక్ష్మీ నగర్ లో యు జి డి పనులను మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ గారు ప్రారంభించారు. సుమారు 19 లక్షల వ్యయం, జిహెచ్ఎంసి బడ్జెట్ తో చేపడుతున్న డ్రైనేజీ పనులను కాలనీ అధ్యక్షుడు కాలనీవాసులతో కలిసి కార్పొరేటర్ గారు ప్రారంభించారు. సుమారు 20 సంవత్సరాల క్రితం చేసిన చిన్న పైపులైను ఉండేది. జన్మభూమి కార్యక్రమంలో చేపట్టిన డ్రైనేజీలు ఇప్పటివరకు కొన సాగాయి. తరచుగా అవి సమస్యా త్మకంగా మారడం , జనాభా పెరగడం అపార్ట్మెంట్లు పెరగడం వల్ల ఇబ్బందులు చాలా వచ్చాయి. మళ్లీ ఎన్ని సంవత్సరాలకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు చంద్రశేఖర్ యాదవ్, కిరణ్,రమణ, ప్రసాద్ తో పాటు కాలనీ ప్రెసిడెంట్ వగ్గు మురళి కృష్ణ,వగ్గు చంద్రశేఖర్, గుప్త, రంగారావు ,రాంసాగర్, విజయ్,శివ ,యాదలక్ష్మి, రాజు సతీష్, పవన్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *