Narne Srinivasa Rao Hyder Nagar Division Corporator
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులను ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, శ్రీనివాస కాలనీ లో రూ. 28.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులు మొదలైన సందర్భంగా పనులను పరిశీలించడం జరిగింది అని, ఇంజనీరింగ్ మరియు ఇరిగేషన్ అధికారులతో సమన్వయ పరిచి పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అలానే పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఇరిగేషన్ ఏఈ విశ్వం, కాంట్రాక్టర్ బాబురావు, గిరి హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు నవీన్ నాయుడు, గూడూరు రమేష్, వెంకట్ చౌదరి, శ్రీనివాస్, సుబ్బరాజు, బి అర్ కె రాజు తదితరులు పాల్గొన్నారు.
0 Comments