Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

నూతన సీసీ రోడ్డు,మరియు సివరేజి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు దుర్గ నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఎటువంటి సమస్యలు ఉన్న పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు, అలాగే డ్రైనేజ్ మరియు సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA భాస్కర్, ప్రణయ్,బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *