Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: February 2024

Review meeting at Seethaphalmandi TSSPDCL Office. Discussed with HMWSSB Officials on the Pending Development works

హేమ సామల సీతాఫల్మండి కార్పొరేటర్, TSSPDCL కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ గృహ జ్యోతి పథకంపై గృహాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడంతోపాటు వేసవిలో పెరుగుతున్న విద్యుత్ సరఫరాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీతాఫల్‌మండి డివిజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు & వేసవి డిమాండ్‌కు సరిపడా తాగునీటి సరఫరాపై HMWSSB అధికారులతో చర్చించారు.

Commissioner Venugopal Reddy, Corporator Suman visited Boduppal,21 Division.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ *కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్* పలు సమస్యలను గౌరవ కమీషనర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా డివిజన్‌లో పర్యటించి అక్కడి సమస్యలను సంబంధిత అధికారులతో పరిశీలించి హామీ ఇచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని, డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరెడ్డి, ఎలుగొండయ్య, ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు, యువజన నాయకులు సూర్యనారాయణ, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, వార్డు అధికారి అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Inspecting Ongoing Sewerage line work at Murtuza Nagar Reinbazar Division,

On the instructions of AIMIM President Barrister Asaduddin Owaisi sahab,Yakutpura MLA Janab Jaffar Hussain Meraj Sahab and Yakutpura Incharge Yasar Arfath sahab

AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin and Senior worker Waseem Uddin inspecting Ongoing Sewerage line work at Murtuza Nagar Reinbazar Division, Yakutpura Constituency.

In pics Area Presidents Tajammul bhai, Khaja Bhai & Baba Bhai and active workers and primary unit were present.

Corporator Sabiha Ghausuddin celebrating Shabe Miraj in Safdar

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ లో ఈరోజు రాత్రి షబే మిరాజ్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్
గారు, మసీదుల వద్ద జిహెచ్ఎంసి సఫాయి సిబ్బందితో క్లీనింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో మొత్తం 22 మసీదులు ఉన్నాయని జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ లకు తెలుపుతూ అన్ని మసీదుల దగ్గర సఫాయి సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, షఫీ, అబ్దుల్ సలీం, బాబా, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, సన్నరాజుల లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

ప్రజా యుద్ద నౌకా గద్దర్ గారి జయంతి నివాళులు.

ప్రజా యుద్ద నౌకా గద్దర్ గారి జయంతి సందర్భంగా కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాము,B స్వామి, వెంకటయ్య, బాబు,రాజు, రాంచందర్, ప్రబాకర్, శ్రీనివాస్, ఫయాజ్ పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం.

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.పెండింగ్ పనులు, కొత్తగా కావాల్సిన శాంక్షన్స్, నాలా పనులు తదితర వాటిపైన వేగంగా స్పందించి పనులు పూర్తి చెయ్యాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డి ఈ మహేష్, ఏ ఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.