Madhavaram Rojadevi Vivekananda Nagar Division.
వివేకానందనగర్ డివిజన్ పరిధిలో నీ బాగ్ అమీర్ మరియు రామకృష్ణ నగర్ లో భూగర్భ డ్రైనేజీ పనుల కొరకు వాటర్ వర్క్ మేనేజర్ ప్రియాంక గారు,కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు గారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ రోజదేవి గారు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ బస్తీలను అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నాయని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి సహకారంతో డివిజన్లో ఉన్న సమస్యలన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. డ్రైనేజీ పైప్లైన్ పనులను వీలైనంత త్వరగా మొదలుపెట్టించాలని వాటర్ వర్క్ మేనేజర్ ప్రియాంక గారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సూపర్వైజర్ నాగరాజు డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి,మొజిజ్ యాదయ్య, యాదగిరి,అల్లం మహేష్,మధు జగదీష్ గౌడ్,తీగల కృష్ణ,రాధా భాయ్, లింగయ్య,సంపత్,మురళి, రవి, లక్ష్మి యూసఫ్,సంతోష్ లక్ష్మి దేవి రవి హరీష్ మూతయాలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments