Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: January 23, 2024

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల శ్రీరామ్ నగర్ కాలనీ, తారానగర్ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో మరియు హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో “బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట” మహోత్సవం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు విచ్చేసి రామనామ స్మరణకు పాత్రులయ్యారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా రామాలయంలో నిర్వహించిన శ్రీ రామ యజ్ఞంలో పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న ‘కమాన్’ (ARCH) ను స్థానిక నాయకులతో, అసోసియేషన్ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.