Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

V Gangadhar Reddy

Gangadhar Reddy Gachibowli Corporator.

ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాం…

ప్రజల్లోకి నేరుగా వెళ్లి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం.

ప్రతి కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి……..

నానక్ రామ్ గూడా లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట…

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానక్ రామ్ గూడా లో ప్రజా సమస్యలపై బస్తీ బాట లో భాగంగా కాలనీలో సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు గచ్చిబౌలి కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి గారు. అనంతరం కాలనీ లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ గారి దృష్టికి నానక్ రామ్ గూడా కాలనీ వాసులు తీసుకువచ్చారు.ఇందులో భాగంగా కాలనీ లో మంచి నీళ్లు, డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. జి.హెచ్.ఎం.సి అధికారులతో మాట్లాడుతూ డ్రైనేజి, సిసి రోడ్లు, మంచి నీళ్లు, మురికి కాలువల పనుల గురించి చర్చించారు. బస్తీలో వెంటనే కొత్త భూగర్భ డ్రైనేజి, మంచి నీళ్లు పైప్ లైన్ మరియు సీసీ రోడ్డులు మంజూరు చేయాలనీ అధికారులని కోరారు. అనంతరం బస్తీలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి అని శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. బస్తీ బాట లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. బస్తీ బాట తో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి పేర్కొన్నారు.ఒకటిన్నర సంవత్సరం వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యాకమాలు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతూ పని చేస్తానని వారు అన్నారు, నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా గచ్చిబౌలి డివిజన్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం శ్రమిస్తూ ఉంటానని వారు తెలిపారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ విశాలాక్షి గారు , ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్ గారు, హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ గారు, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి, సీనియర్ నాయకులు కైలాష్ సింగ్, ప్రభాకర్,నర్సింగ్ నాయక్ మాధవ రెడ్డి,ముత్యం రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి,దర్శన్ సింగ్,రాందీన్ సింగ్,రాజ్ కుమార్ సింగ్,గుల్షన్ సింగ్,విజయ్ సింగ్,విక్కీ సింగ్ యాదగిరి,ధన్ రాజ్,శ్రీనివాస్ రెడ్డి,జయ్ రెడ్డి,అశోక్ సింగ్,రమేష్ గౌడ్,విశాల్ సింగ్, ప్రకాష్,శంఖేష్ సింగ్,దేవరకొండ గోపాల్, అరవింద్ సింగ్ నరేందర్, శానిటేషన్ సూపర్ వైసర్ కిష్టయ్య, నానక్ రామ్ గూడా వాసులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Gangadhar Reddy Gachibowli Corporator.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు శ్రీ Bandi Sanjay Kumar గారిని ఢిల్లీ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బిజెపి నాయకులు Ravi Kumar Yadav గారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాదర్ రెడ్డి గారు.

నేడు న్యూఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు మరియు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఢిల్లీకి విచ్చేసిన సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పార్టీని ప్రతిష్ఠ స్థితికి తీసుకువస్తామని, క్యాడర్ చాలా బలంగా ఉందని ఇక్కడి పరిస్థితులను వివరించారు. మమ్మల్ని వెనుక ఉండి ప్రోత్సాహo అందించాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ లో అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అధికార పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా ముందుకు వెళ్తున్నామని, మీ లాంటి వ్యక్తుల సహకారం తో మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని అన్ని అన్నారు.2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపునకు కృషి చేస్తానని వారికి తెలియజేయడం జరిగింది.

Vijaya Sankalpa Sabha