భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.
భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.
దాదాపు ఆరు నెలలుగా జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగలేదని,త్వరలోనే ఎన్నికల కోడ్ రానుందని,అంత లోపల జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని, డివిజన్ వారీగా అభివృద్ధి నిధులను కేటాయించాలని, జోనల్ మీటింగ్ లు జరపాలను కోరడం జరిగినది.త్వరలోనే రానున్న వేసవికి సంబంధించిన సమస్యలు, నాలా డిసైలటింగ్ పనులు, శానిటేషన్ వ్యవస్థ , అక్రమ పార్కింగ్ చార్జీలు, విచ్చలవిడి ఆస్తి పన్ను వసూలు, లాంగ్ స్టాండింగ్ అధికారులు పై చెర్యలు తదితర సమస్యలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.సానుకూలంగా స్పందించిన కమిషనర్ జోనల్ లెవెల్ లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది, సాధ్యమైనంత త్వరలో జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ శ్రవణ్, సురేఖ, వంగ మధుసూదన్ రెడ్డి,రవి చారీ,చేతన, రాజ్యలష్మి తదితరులు పాల్గొన్నారు.