అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 7.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు
అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 7.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు బాపు నగర్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యలను పరిశీలించి స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులకు చూపించి ఇప్పటి జనాభాకు అనుగుణంగా అవసరమైన చోట నూతన డ్రైనేజ్ పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన చోట 11 కెవి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయాలని,స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తి చేయ్యాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు AE మజీద్, విద్యుత్ AE శ్రీనివాస్,వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA పాషా,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.