Tag: telangana
ప్రజా యుద్ద నౌకా గద్దర్ గారి జయంతి నివాళులు.
ప్రజా యుద్ద నౌకా గద్దర్ గారి జయంతి సందర్భంగా కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాము,B స్వామి, వెంకటయ్య, బాబు,రాజు, రాంచందర్, ప్రబాకర్, శ్రీనివాస్, ఫయాజ్ పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం.
మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.పెండింగ్ పనులు, కొత్తగా కావాల్సిన శాంక్షన్స్, నాలా పనులు తదితర వాటిపైన వేగంగా స్పందించి పనులు పూర్తి చెయ్యాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డి ఈ మహేష్, ఏ ఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి.
గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ G కిషన్ రెడ్డి గారిని కలిసి మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ఉప్పల్ MLA శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి కోరిన .మీర్పేట హెచ్బీ కాలనీ కార్పొరేటర్ జేరెపోతుల ప్రభుదాస్,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి .
శ్రీ మహాత్మా గాంధీ వర్ధంతి
శ్రీ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా BRS పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులతో కలిసి ముత్యంరెడ్డి నగర్ను సందర్శించి అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. మురుగు కాలువలు, పారిశుధ్యం, పార్కు సుందరీకరణ, కొత్త స్తంభాలు, లైట్ల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు.
సర్దార్ నగర్ పర్యటించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ .
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్దార్ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు పర్యటించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ సున్నం చెరువు మరియు కాముని చెరువు నుండి దిగువగా సబ్ధర్ నగర్ మీదుగా ప్రవహిస్తున్న నాలాలో తెలుడు వ్యర్ధ పదార్దాలు పేరుకుపోయి, నాలా ప్రవాహానికి ఆటంకం ఏర్పడటం వల్ల జిహెచ్ఎంసి సిబ్బంది మరియు జెసిబి సహాయంతో తేలుడు వ్యర్ధ పదార్ధాలను తొలగించి నాలా ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, జిహెచ్ఎంసి సిబ్బందికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, అహ్మద్, బాబా, పార్వతమ్మ, సన్నజాజుల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
చిలకలగూడలో జాతిపిత మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి
జాతిపిత మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా చిలకలగూడలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ హేమ సామల.
డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్వాన్ డివిజన్ కార్పొరేటర్
కార్వాన్ డివిజన్లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను HMW&SSB అధికారులతో కలిసి డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ మందగిరి స్వామియాదవ్.
ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! మల్లాపూర్ కార్పొరేటర్
జాతిపిత మహాత్మ గాంధీ గారి 76 వ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పంచారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము,హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు.