Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: January 2024

జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి

డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్వాన్ డివిజన్‌ కార్పొరేటర్

కార్వాన్ డివిజన్‌లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను HMW&SSB అధికారులతో కలిసి డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్వాన్ డివిజన్‌ కార్పొరేటర్ మందగిరి స్వామియాదవ్.

ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! మల్లాపూర్ కార్పొరేటర్

జాతిపిత మహాత్మ గాంధీ గారి 76 వ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పంచారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ

అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము,హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు.

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి!

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి! ఈ అమరవీరుల దినం నాడు స్వాతంత్ర‌ పోరాట యోధులను మనమందరం స్మరించుకోవాలి.కార్పొరేటర్ హేమ సామల

జాతిపిత మహాత్మ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.

నేడు మహాత్మ గాంధీ గారి వర్ధంతి అహింసా మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన లక్ష్మారెడ్డి గారికి శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు శుభాకాంక్షలు తెలియజేసారు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన లక్ష్మారెడ్డి గారు.ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ ఆల్ యాదవ మహిళా ఫ్రంట్ చైర్ పర్సన్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు తన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసారు. మల్లన్న ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో భూగర్భ డ్రైనేజీ రోడ్లపై పొంగిపొర్లి స్థానికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించిన కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో భూగర్భ డ్రైనేజీ రోడ్లపై పొంగిపొర్లి స్థానికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది అని స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు ఎయిర్ టేక్ మిషన్ సహాయంతో సివరేజ్ సిబ్బందితో మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ ఎయిర్ టేక్ మిషన్ సహాయంతో ప్రెషర్ పెట్టి లోపల ఉన్న షిల్టును తొలగించాలని చుట్టు పక్కల ఉన్న మిగతా మ్యాన్ హోల్స్ కూడా క్లీన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జావిదుద్దీన్, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, జుభేర్, యోగి రాజు, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

నూతన సీసీ రోడ్డు,మరియు సివరేజి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు దుర్గ నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఎటువంటి సమస్యలు ఉన్న పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు, అలాగే డ్రైనేజ్ మరియు సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA భాస్కర్, ప్రణయ్,బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మల్లాపూర్ లో జరిగిన కాప్రా పట్టణ మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక మహిళ పొదుపు సంఘాల సమావేశంలో ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి కార్పోరేటర్ దేవేందర్ రెడ్డి.