Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 18, 2022

శాలివాహనగర్ అంగన్వాడీ కేంద్రం లో

పాఠశాలలు పునః ప్రారంభం అయిన నేపధ్యంలొ

అంగన్వాడీ పిల్లలను ప్రోత్సహిస్తూ వారికి పలకలు పంచడం జరిగింది.

అనంతరం వారి ఆహార సమయంలో వారికి పౌష్టిక ఆహారం వడ్డించడం జరిగింది.

అందరికి నమస్తే, ఈ రోజు ఓల్డమల్కాజ్గిరి మహంకాళి అమ్మవారి గుడి వద్ద అన్ని శాఖల అధికారులు మరియు ఆలయ కమిటీ సభ్యులతో బోనాల ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ శాఖలవారు వారి శాఖలకు సంబంధించిన పనులను చర్చించడం, ముఖ్యంగా సానిటైజేషన్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, రోడ్ ప్యాచ్ వర్క్, లైటింగ్, కరెంట్ డిపార్ట్మెంట్ వారి తోటి కరెంటు సప్లై తదితర విషయాలను చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో, DC గోధుమల రాజు, SI శ్రీనివాస్, A.E సత్య లక్ష్మి, HMWS&SB DGM స్రవంతి రెడ్డి, మనోహర్ రెడ్డి, A.E వెంకటేష్, SFA గిరి, జవాన్ దాస్, జవాన్ అజయ్,A. E వనజ, శివ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.

వర్షాల కారణంగా తిరుమల నగర్ కాలనీ లో రహదారి ధ్వంసం అవ్వడం వలన కాలనీవాసులు ఇబ్బంది పడుతుండడంతో కార్పొరేటర్ ప్రేమ్ గారు జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందిని అప్రమత్తం చేసి తక్షణమే రోడ్డు మరమ్మతు పనులను చేపట్టడం జరిగింది.

వర్షాల కారణంగా త్యాగరాజ నగర్ కాలనీ లో డ్రైనేజ్ పైప్ లైన్ ధ్వంసం అవ్వడం వలన కాలనీవాసులు ఇబ్బంది పడుతుండడంతో కార్పొరేటర్ ప్రేమ్ గారు జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందిని అప్రమత్తం చేసి తక్షణమే పనులను చేపట్టడం జరిగింది.

పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో గౌరవ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎమ్మెల్యే సాయన్న గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.