Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 4, 2022

కార్పొరేటర్ శ్రీమతి ఉమారమేష్ యాదవ్ కాచిగూడ డివిజన్ వీరన్నగుట్టలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం

కార్పొరేటర్ శ్రీమతి ఉమారమేష్ యాదవ్ కాచిగూడ డివిజన్ వీరన్నగుట్టలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు కార్పొరేటర్ శ్రీమతి ఉమారమేష్ యాదవ్ గారితో కలిసి పాల్గొని అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్లపై ఉన్న మట్టికుప్పలను, పేరుకుపోయిన చెత్త చెదరాలను, ఇతర వ్యర్ధాలను జీహెచ్ఎంసీ సిబ్బందిచే తొలగింపజేశారు.

అలాగే ఎమ్మెల్యే గారు వీరన్నగుట్టలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

#umarameshyadav#manacorporator#GHMC

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న చిల్కానగర్ డివిజన్4 కోట్ల 34 లక్షల రూపాయల అభివృద్ధి పనులను శంకుస్థాపన

4 కోట్ల 34 లక్షల రూపాయల అభివృద్ధి పనులను శంకుస్థాపన

చిల్కానగర్ డివిజన్ లో ఈరోజు 4 కోట్ల 34 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు
స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు
గౌరవ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.